SOURCE :- BBC NEWS
కెనడా: జీ 7 సదస్సు నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్, ఏం జరిగింది?
ఒక గంట క్రితం
కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశం నుంచి డోనల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగానే ఆయన త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ తెలిపింది.
ట్రంప్ సహా జీ7 నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇజ్రాయెల్కు స్వీయ రక్షణ హక్కు ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అస్థిరతకూ, ఉగ్రవాదానికి మూల కారణం ఇరానేనని కూడా ఆ ప్రకటనలో ఉంది. మరోవైపు తెహ్రాన్లో ఉంటున్న కోటి మంది ప్రజలంతా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కోరారు. బీబీసీ ప్రతినిధి జేమ్స్ లాండేల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)