SOURCE :- BBC NEWS

ఇండియా – పాకిస్తాన్ బోర్డర్‌లో ఇదీ పరిస్థితి..

35 నిమిషాలు క్రితం

”మేం ఎలాగోలా ఉరీ సెక్టార్‌లోని సలామాబాద్‌ అనే ఈ చిన్నగ్రామానికి చేరుకోగలిగాం. ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. చుట్టుపక్కల ఒక్కరు కూడా కనిపించడం లేదు.

ఇక్కడ ఈ రెండు ఇళ్లు ఇప్పటికీ మండుతూ ఉన్నాయి. ఈ ఇళ్లలో ఉన్న వారికి ఏం జరిగిందో మాకు సమాచారం లేదు. వేర్వేరు చోట్ల నివసిస్తున్న కొందరు స్థానికులకు ఫోన్ చేసి మాట్లాడాం.

పాకిస్తాన్‌లో దాడులు చేశామని భారత్ ప్రకటించిన తర్వాత సరిహద్దుకు అవతలి నుంచి పాకిస్తాన్ దాడులు చేసిందని వాళ్లు మాతో చెప్పారు. కొన్ని బాంబులు ఈ ఇంటిపై కూడా పడ్డాయి.”

భారత్, పాకిస్తాన్, జమ్మూకశ్మీర్, ఇండో పాక్ బోర్డర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)