SOURCE :- BBC NEWS

ఒక గంట క్రితం
అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ శనివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు.
మెస్సీ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.
”మ్యాచ్ చివరి 5-10 నిమిషాలపాటు సింగరేణి తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడతారు. మ్యాచ్లో విజేతలకు మెస్సీ చేతుల మీదుగా ట్రోఫి అందిస్తాం” అని మెస్సీ హైదరాబాద్ టూర్ చీఫ్ ప్యాట్రన్, సలహాదారు పార్వతీరెడ్డి మీడియాకు వెల్లడించారు.
మెస్సీతో మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీసు చేశారు.
ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39వేలు.









(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)







